క్రైమ్/లీగల్

లంచం తీసుకుంటూ ఏసిబికి దొరికిన విఆర్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, మే 21: ప్రభుత్వం వేలకు వేలు జీతాలు ఇస్తూ ఉద్యోగాలు చేయమంటే రాష్ట్రంలో కొందరు స్వార్థం కోసం ప్రజలను పట్టిపీడిస్తుంటారని అందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్ల తహసీల్దారు కార్యాలయంలో సోమవారం ఏసీబీ వారు దాడులు నిర్వహించి మండలంలోని కల్లమల్ల వీఆర్‌ఓ భాషావల్లి లంచం తీసుకుంటుండగా పట్టుకొని అరెస్టుచేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగరాజు తెలిపారు. వివరాల్లోకెళ్తే..కల్లమల్ల గ్రామాకిని చెందిన ఓబులేసు అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం కోసం గత కొద్దిరోజుల నుంచి వీఆర్‌ఓ అధికారాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వీఆర్‌ఓ బాషా 30 వేల రూపాయలు లంచంగా ఇస్తేగాని నీకు పాసుపుస్తకం ఇప్పించనని తెలుపడంతో రైతు ఓబులేసుకు దిక్కుతోచకా కడప ఏసీబీ వారిని ఆశ్రయించారు. వారు 15 వేల లంచం ఓబులేసు చేతికి ఇవ్వగా సోమవారం ఓబులేసు వీఆర్‌ఓ బాషావల్లికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి వీఆర్‌ఓను పట్టుకున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. వీరిపై కేసును నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.