క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు- ద్విచక్రవాహనం ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, మే 20: తమిళనాడు ఆర్టీసీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గుడుపల్లి ఎస్సై భాస్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం చిన్న బొమ్మరసపల్లి గ్రామానికి చెందిన చంద్రప్ప భార్య సరస్వతి(39), కుమారులు ప్రకాష్(18), సుబ్రమణ్యం(24)లు ద్విచక్రవాహనంలో ఆదివారం మధ్యాహ్నం ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరి వాహనం గుడుపల్లి మండలం తలి అగ్రహారం గ్రామం వద్దకు చేరుకోగానే కృష్ణగిరి నుండి వేపనపల్లి గ్రామానికి వెళ్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన సరస్వతి, సుబ్రమణ్యంలను హుటాహుటిన కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.