క్రైమ్/లీగల్

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపూర్, మే 22: మండలంలోని బొమ్మకల్ గ్రామంలో జనబోయిన నర్సయ్య (75) అనే వృద్ధుడిని చున్నీతో మెడకు ఉరివేసి నులిపి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన మంగళవారం గ్రామంలో చోటు చేసుకుంది. సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు నర్సయ్యకు రెండు ఎకరాల భూమి ఉండగా, ఆ భూమిని తన కొడుకు వెంకటస్వామికి ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్ట్రేషన్ చేయించారు. వెంకటస్వామి ఇంటిలో లేని సమయంలో నర్సయ్యను తన కొడుకు శివకుమార్, కూతురు శివానితో కలిసి జెడబోయిన స్వరూప హత్య చేసి తన మామ ఆత్మహత్య చేసుకున్నాడని బుకాయించింది. తనకున్న భూమిని కుమారుడు శివకుమార్‌కు రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చేదని, అలాగే పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయన్నారు. తన కొడుకుకు భర్త వెంకటస్వామి రిజిస్ట్రేషన్ చేయడనే ఉద్ధేశంతో వెంకటస్వామి లేని సమయంలో ముగ్గురు కలిసి హత్యకు పాల్పడ్డారు. మృతుడి చిన్న కూతురు యామ సులోచన ఇచ్చిన ఫిర్యాదు తన తండ్రిని జనబోయిన స్వరూప, జనబోయిన శివకుమార్, జనబోయిన శ్రీవాణిలే హత్య చేశారని, మృతికి వారే కారణమంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్ తెలిపారు. సంఘటనా స్థలానికి హుజూరాబాద్ ఎసీపీ కృపాకర్, హుజూరాబాద్ రూరల్ సిఐ రవి కుమార్ సంఘటన వివరాలను సేకరించారు.