క్రైమ్/లీగల్

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగళి, మే 24 : మండల పరిధిలోని బొమ్మరసనపల్లికి చెందిన దేవరాజు(42) బుధవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎఎస్సై ఖలీల్‌బాషా తెలిపారు. దేవరాజు గత కొంతకాలంగా మద్యం సేవించేవాడని, మద్యం సేవించడానికి అప్పులు అధికం కావడంతో మనస్తాపానికి గురై మద్యంలో పురుగుల కలుపుకొని సేవించాడు. గురువారం ఉదయం అపస్మారకస్థితిలో పడి ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం టుంకూరు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడి భార్య వసంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భయబ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తి అరెస్టు
హిందూపురం టౌన్, మే 24 : హిందూపురం ప్రాంతంలో అంతరాష్ట్ర ముఠాలు తిరుగుతున్నాయని, పిల్లలను ఎత్తుకెళ్లేవారు ఉన్నారని వాట్సాప్, ఫేస్‌బుక్‌లో సమాచారం ఉంచి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న పరిగి మండలం ధనాపురంకు చెందిన శంకరప్ప అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు తెలిపారు. హిందూపురం మున్సిపల్ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లి, కొల్లకుంట, సింగిరెడ్డిపల్లి ప్రాంతాల్లో ఆయా ముఠాలు తిరుగుతున్నాయని తప్పుడు సమాచారం ఉంచిన శంకరప్పను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు నియమించి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు అతన్ని అరెస్టు చేసి క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎవరైనా అనవసరంగా ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా వాట్సాప్, ఫేస్‌బుక్కుల్లో పోస్టింగ్‌లు ఉంచితే క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు సీఐ స్పష్టం చేశారు.