క్రైమ్/లీగల్
వ్యక్తి దారుణ హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 25 May 2018
కర్నూలు, మే 25: నగర శివార్లలోని సుంకేసులో రోడ్డు మాసమసీదు దగ్గర వైన్షాపు దగ్గర చాకలి రాముడు (38)ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. మద్యం మత్తులో మాటమాటల్లో ఘర్షణ పడి చివరకు హత్యకు దారితీసింది. మృతుడు నగరంలోని ధర్మాపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న కర్నూలు తాలుకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు. హత్యకు దారితీసిన ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.