క్రైమ్/లీగల్

రూ.1.82కోట్ల బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 25: నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో శుక్రవారం ఉదయం విజయవాడ డి ఆర్ ఐ అధికారులు భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. మొత్తం 5.7కేజీల బరువుకలిగిన వివిధ పరిమాణాల్లో ఉన్న 58 బంగారు బిస్కట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని మొత్తం విలువ సుమారు రూ.1.80కోట్లు ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. చెన్నై నుండి విజయవాడ వైపు టయోటా కారులో అక్రమంగా ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల బృందం జాతీయ రహదారిపై వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. అయితే ఈ సంఘటనపై జిల్లా అధికారులెవరికి సమాచారం లేదు. విజయవాడ నుండి వచ్చిన డి ఆర్ ఐ అధికారుల బృందం సొంతంగా ఈ దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకొని బంగారంతో పాటు తమ వెంట తీసుకెళ్లారు.