క్రైమ్/లీగల్

రూ. 3 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి నకిలీ కరెన్సీ నోట్లను తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు, 3 లక్షల రూపాయల నకిలీ నోట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సు అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కామాఖ్య- యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న జార్ఖండ్‌కు చెందిన పహద్ గావ్ నకిలీ నోట్లతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందడంతో ఖుర్దా రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద డీఆర్‌ఐ (హైదరాబాద్ జోన్ యూనిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా, నకిలీ 2000 రూపాయల నోట్లను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల కేంద్రమైన బంగ్లాదేశ్‌లోని కలియాచౌక్ నుంచి ఈ నోట్లను ఒక వ్యక్తి ద్వారా తీసుకువచ్చినట్లు నిందితుడు తెలిపాడని అధికారులు తెలిపారు. నిందితుడని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.