క్రైమ్/లీగల్

గుత్తి కొండపై యువకుడి దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, మే 27 : ప్రముఖ చారిత్రాత్మక కట్టడం గుత్తి కోటలో 20 సంవత్సరాల గుర్తు తెలియని యువకుడు దారణహత్యకు గురైన ఘటన ఆదివారం సంచలనం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికులు కొందరు గుత్తికోటను సందర్శించేందుకు కొండపైకి వెళ్లారు. కొండలోని గుర్రంశాల సమీపంలోని ఓ పెద్ద బావిలో 20 సంవత్సరాలు నిండిన ఓ యువకుడి మృతదేహం బోర్ల పడి ఉండటం గమణించి వెంటనే గుత్తి పోలీసులకు చేరవేశారు. వెంటనే వచ్చి మృతదేహాన్ని బయటకు బయటికి తీయగా శరీరంపై, తలపై గాయాలున్నాయి. మృతదేహం లభ్యమైన సమీప ప్రాంతంలోనే బండరాళ్లకు రక్తం తగిలి ఉండడంతోపాటు యువకున్ని చితకబాది బలవంతంగా లాక్కెళ్లి బావిలోకి పడవేసినట్లు తెలుస్తోంది. కాగా హత్యకు గురయ్యేముందు తీవ్రస్థాయిలో పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు ఎవరనేది తెలియరాలేదు. కాగా గుత్తి కోటకు సందర్శన కోసం వచ్చిన యువకులే అతన్ని చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.