క్రైమ్/లీగల్
అప్పుల బాధ తాళలేక కౌలురైతు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 27 May 2018
బేతంచెర్ల, మే 27:కుటుంబ పోషణ కోసం భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తూ అప్పులపాలైన కౌలు రైతు నాయకంటి పుల్లయ్య(45) పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం మండల పరిధిలోని అంబాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. పుల్లయ్య గత కొనే్నళ్లుగా గ్రామంలోని రైతుల దగ్గర భూమి కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తుండేవాడు. అయితే వర్షభావ పరిస్థితుల వల్ల పంటలు సరిగా పండక, పండినా గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో అప్పులు తీర్చలేక ఇంటిలో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన బంధువులు హుటాహుటిన అతడిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.