క్రైమ్/లీగల్
మంటల్లో చిక్కుకుని వృద్ధుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 27 May 2018
వేమూరు, మే 27: మొక్కజొన్న ఎండిదండుకు నిప్పటించిన మంటల్లో చిక్కుకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఇది. ఎస్ఐ అంబటి మన్మధరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమల్తులూరు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన దేవరకొండ సుబ్బయ్య (80) వేమూరు మండలంలోని పోతుమర్రు రెవెన్యూ గ్రామమైన పులిచింతలపాలెంలో తన మాగాణి పొలానికి మధ్యాహ్నం వెళ్లాడు. ఈ క్రమంలో మొక్కజొన్న ఎండిదండుకు గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ ఏ కోటిరెడ్డి, ఎస్ఐ అంబటి మన్మధరావులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.