క్రైమ్/లీగల్
మహాలక్ష్మి ఆలయంలో చోరీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 27 May 2018
బిట్రగుంట, మే 27 : బోగోలు మండలం ఎస్వీపాలెం పంచాయతీలో సిద్దవరపువెంకటేశ్వరపాలెం గ్రామంలో మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగినట్లు ఉప సర్పంచ్ రాజు శ్రీనివాసులురెడ్డి బిట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాలక్ష్మి ఆలయంలో శనివారం రాత్రి తలుపులకు వేసి ఉన్న తాళం పగలుకొట్టి హుండీని దొంగలు తీసుకెళ్లినట్లు తెలిపారు. చోరీకి గురైన హుండీ సమీపంలోని పొలాల్లో దొరికినట్లు చెప్పారు. హుండీలో సుమారు రూ.50 వేలు కానుకలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 24న నాగవరప్పమ్మ ఆలయం చోరీ జరిగిందన్నారు. వరుస చోరీ వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు.