క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్కలి, మే 27:మండలంలోని జాతీయరహదారిపై అయోధ్యపురం సమీపంలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు ఘటనా స్థలంలో మృతి చెందగా, మరొకరు విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. అయోధ్యపురం గ్రామ సమీపంలో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న కోళ్ల వ్యాన్ మరమ్మతుకు గురైంది. అదే మార్గంలో వెళ్తున్న మరో కోళ్లువ్యాన్ మరమ్మతుకు గురైన వ్యాన్ ప్రక్కన ఆపి మాట్లాడుతుండగా విశాఖ నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న పాలవ్యాన్ బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో కృష్ణారావు(30) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాస్(34) టెక్కలి ఏరియా ఆసుపత్రిలో చేర్పించగా మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. త్రినాధ్‌నాయక్, ఎస్.చిన్న, నరేష్‌లు గాయపడ్డారు. వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతులు ఇచ్ఛాపురంకు చెందిన వ్యక్తులు కాగా, గాయపడ్డ క్షతగాత్రులు విశాఖజిల్లా ముత్యాలపేటకు చెందిన వ్యక్తులు. ఈ విషయం తెలుసుకున్న టెక్కలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టెక్కలి పోలీసులు తెలిపారు.