క్రైమ్/లీగల్

రైలు కింద పడి ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర: ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ కుటుంబ సభ్యులు ముగ్గురు రైలు కింద పడి మృతి చెందారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాల ప్రకారం వీరిని గుంటూరు వాసులుగా భావిస్తున్నారు. వీరు ఆత్మహత్యకు పాల్పడి వుంటారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరు నెహ్రూ నగర్‌కు చెందిన బుంగా వెంకయ్య(47), అతని సతీమణి రజని(40), కుమార్తె సాయికృష్ణవేణి(19)గా మృతులను గుర్తించారు. మధిర రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫారం సమీపంలో వీరు రైలు కిందపడి మృతి చెందారు. వీరి వద్ద గుంటూరు నుండి విజయవాడ వరకు ఇంటర్‌సిటీకి తీసుకున్న టికెట్ ఉంది. ఇంటర్‌సిటీలోనే మధిర వరకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడి వుంటారని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. దొరికిన ఫోన్ నంబర్ల ఆధారంగా వాకబు చేయగా మృతుడు వెంకయ్య గుంటూరులోని మిర్చి యార్డులో పని చేస్తుంటాడని తెలిసింది. ఈ కుటుంబం మృతికి కారణాలు తెలియాల్సి వుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలిని మధిర టౌన్ ఎస్సై తిరుపతిరెడ్డి పరిశీలించారు.