క్రైమ్/లీగల్

బైకును ఢీకొట్టిన లారీ ... ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిడుగురాళ్ల/ కారంపూడి, జూన్ 5: మినీలారీ, బైకును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందిన ఘటన మంగళవారం మధ్యాహ్నం పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ సమీపంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... కారంపూడికి చెందిన సంతోష్ (20), శశికుమార్ (20) ఇద్దరూ పిడుగురాళ్లలో పనిచూసుకుని కారంపూడికి వెళ్తుండగా కారంపూడి నుండి నర్సరావుపేట వెళ్తున్న మినీలారీ యువకులు వస్తున్న బైకును ఢీకొట్టడంతో సంతోష్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రగాయాలైన శశికుమార్‌ను పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మినీలారీ డ్రైవర్ పరారుకాగా పిడుగురాళ్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలావుండగా రోడ్డు ప్రమాదంలో కారంపూడి వాసులు మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. చిన్నవయసులోనే చేతికి అంది వస్తున్న కుమారుడు మృతి చెందడంతో ఆకుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.