క్రైమ్/లీగల్

కృష్ణానదిలో పడి వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెంటచింతల, జూన్ 5: కృష్ణానదిలో పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాచర్లలోని నెహ్రూనగర్ రెండో లైనుకు చెందిన మంచా కోటిరెడ్డి (47) మాచర్లలో ఫర్టిలైజర్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. షాపు నిర్వహణ కోసం తెచ్చిన అప్పులు వసూలు కాకపోవడం, బాకీలు ఇచ్చిన వారు వత్తిడి చేయడంతో మనస్థాపం చెంది కోటిరెడ్డి సత్రశాల మల్లిఖార్జునస్వామి వారి ఆలయంలో సోమవారం రాత్రి నిద్ర చేయడానికి వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్ళారు. తెల్లవారి పది గంటలైనా రాకపోవడంతో భార్యాపిల్లలు సత్రశాల వద్దకు చేరుకుని కృష్ణానది ఒడ్డున ఉన్న పరిసరాలను గాలించగా ఒడ్డునే ఆయన బట్టలు, చెప్పులు ఉన్నాయి. కృష్ణానదిలో పడి ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలపడంతో వెంటనే నదిలో గాలింపు చేపట్టారు. మృతదేహం మంగళవారం మధ్యాహ్నం లభ్యమైంది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఎంబీబీఎస్‌లో పట్ట్భద్రుడైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెంటచింతల ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించినట్లు తెలిపారు.