క్రైమ్/లీగల్

పరీక్ష బాగా రాయ లేదని విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూన్ 7: పరీక్ష బాగా రాయలేదనే మనోవేదనతో జీవితంపై విరాక్తి పొందిన ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఉధంతమిది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పాలితం గ్రామ పంచాయతీ పరిధిలోని గోపయ్యపల్లి గ్రామానికి చెందిన గణేష్ (20) అనే విద్యార్థి పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్నాడు. 2017-2018 విద్యా సంవత్సరం డిగ్రీ వార్షిక పరీక్షలు రాయగా, అందులో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుండి బాధ పడుతున్న గణేష్ సప్లిమెంటరీ పరీక్షలలోనైనా ఉత్తీర్ణత సాధించాలని కృత నిశ్ఛయంగా ఉన్నాడు. ఇటీవల డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గణేష్ పాసు కాననే బెంగతో బుధవారం రాత్రి క్రిమి సంహారక మందు తాగాడు. అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతన్ని కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో మృత్యువాత పడ్డాడు. గురువారం మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై జగదీష్ తెలిపారు.