క్రైమ్/లీగల్

లారీ ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, జూన్ 8: సత్తెనపల్లి నియోజకవర్గం ముపాళ్ల మండలం ఇరుకుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం శుక్రవారం చోటు చేసుకుంది. ఇసుక లోడుతో అటుగా వెళుతున్న లారీ వేగంగా వస్తూ బైకును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు కృష్ణాజిల్లా జగయ్యపేటకు చెందిన షేక్ కరిముల్లా (32). గాయపడిన అదే గ్రామానికి చెందిన యండ్రాతి ఆంజనేయులును ఇదే మార్గంలో నరసరావుపేట వెళుతున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్రంగా స్పందించి, వ్యక్తిగత సిబ్బందిని సైతం పక్కన పెట్టి తన ప్రత్యేక వాహనంలో రక్తమోడుతున్న వ్యక్తిని హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. వెంటనే మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని పోలీసులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వీరయ్యచౌదరి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరు ముప్పాళ్ళ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.