క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జూన్ 8: కోదాడ బైపాస్‌లో శ్రీరంగాపురం వద్ద బుధవారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కోదాడ పట్టణ పోలీసులు చెప్పిన వివరాల మేరకు హైద్రాబాద్‌నుండి విజయవాడవైపు వెళుతున్న బొలెరో వాహానం కోదాడ బైపాస్ శ్రీరంగాపురం వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతలకు దుసుకొనిపోయి బోల్తాపడింది. బొలెరోలో ప్రయాణిస్తున్న నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ కొండా ఆదిశేషారెడ్డి (61), వనపర్తి జిల్లా తోమాలపల్లికి చెందిన డ్రైవర్ అబ్దుల్ మాజిద్ బొలెరో బోల్తాపడిన సంఘటనలో స్వల్పగాయాలతో బయటపడ్డారు. బోల్తాపడి రోడ్డుపైనే వున్న బొలెరోలో సెల్‌ఫోన్‌లు వున్న విషయం గుర్తుకు వచ్చి బంధుమితృలకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో బోల్తాపడిన బొలెరోలో వున్న సెల్‌ఫోన్‌లను తీసేందుకు డ్రైవర్ మాజిద్ లోపలికి వెళ్లగా బొలెరో పక్కన ఆదిశేషారెడ్డి నిలబడి మొబైల్ కొరకు ఎదురుచూస్తున్నాడు. ఆదే సమయంలో విజయవాడనుండి హైద్రాబాద్‌కు వెళుతున్న ఆర్టీసి బస్ ప్రమాదానికి గురైన బొలెరోను ఢీకొనడంతో వాహనంలో వున్న డ్రైవర్ మాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుపైన నిలబడివున్న ఆదిశేషారెడ్డి తీవ్రగాయాలకు గురికాగా చికిత్స కొరకు హైద్రాబాద్ తరలిస్తుండగా మార్గమద్యంలో మృతిచెందాడు. బొలెరో పల్టీకొట్టిన సందర్భంలో మృత్యువునుండి బయటపడిన ఇద్దరు మొబైల్ కొరకు వెళ్లి మృత్యువాతకు గురి కావడం అందరిలో విషాదాన్ని నింపింది. కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.