క్రైమ్/లీగల్

తాగి వేధిస్తున్నాడని..భర్తపై గొడ్డలి వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూన్ 8: కడదాకా భర్తతో కాపురం చేయాల్సిన భార్య యముడి అవతారమెత్తింది. భర్త పెట్టే బాధలు తాళలేక విసిగిపోయిన భార్య భర్తను హతమార్చి తన తాళిని తానే తెంపుకున్న వైనం ఇది. తాగొచ్చి నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని కట్టుకున్న భర్తనే గొడ్డలితో నరికి చంపిన ఓ భార్య ఉదంతమిది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి బంధంపల్లి పంచాయతీ పరిధిలోని గొల్లపల్లికి చెందిన కొప్పుల ఓదెలు (65) అనే వృద్ధుడు తన భార్య రాజేశ్వరి (55) చేతిలో గురువారం అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పెద్దపల్లి సీఐ గోపతి నరేందర్, గ్రామస్థుల కథనం ప్రకారం.. ఓదెలు నిత్యం తాగి వచ్చి భార్య రాజేశ్వరిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇది భరించలేని భార్య రాజేశ్వరి పథకం ప్రకారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్త ఓదెలును గొడ్డలితో తలపై నరికి చంపి వేసింది. ఓదెలు ఆగడాలు భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గ్రామస్థులు తెలిపారు. అవసాన దశలో ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాల్సిన సమయంలో భార్య భర్తను దారుణంగా చంపడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఆడ పిల్లలకు పెళ్లిళ్లు కాగా, వారు వేరే ప్రాంతాల్లో ఉంటుండగా, మగ పిల్లలు మాత్రం ఇదే గ్రామంలో వేరుగా నివాసం ఉంటున్నారు. సంఘటనా స్థలాన్ని శుక్రవారం ఉదయం పెద్దపల్లి ఏసీపీ హబీబ్ ఖాన్, సీఐ నరేందర్, ఎస్సై జగదీష్‌లు సందర్శించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గోపతి నరేందర్ తెలిపారు.