చిత్తూరు

తిరుమలలో స్వల్పంగా తగ్గిన రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 18: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గత వారం రోజులుగా దసరా సెలవులు, పెరటాసి మాసం సందర్భంగా తిరుమలలో రద్దీ నెలకొన్న విషయం విదితమే. సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో మంగళవారం భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం మేరకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, దివ్యదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యన 57,339 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.2.89 కోట్లు ఆదాయం లభించింది.