చిత్తూరు

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామికి వైభవంగా పవిత్ర సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, అక్టోబర్ 27: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెండో రోజైన గురువారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ మండపంలోని యాగశాలకు వేంచేపుచేసి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి డి.్ధనంజయులు, సూపరింటెండెంట్లు దినకరరాజ్, కంకణ భట్టార్, శేషాచలం, ఆలయ అర్చక బృందం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.