చిత్తూరు

ఘనంగా టిడిపి జన చైతన్యయాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 6: టిడిపి చేపట్టిన జన చైతన్యయాత్రలో భాగంగా ఆదివారం 12వ వార్డులో ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ 12వ డివిజన్‌లో వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు 1.30లక్షల రూపాయలు పింఛన్లు ఇచ్చామన్నారు. అనేక అభివృద్ధికార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఒక 12వ డివిజనల్‌లోనే 4కోట్ల 3 లక్షల 83వేల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఇక 27 డ్వాక్రా గ్రూపుల కింద 265 మందికి రుణమాఫీ కింద ఒక్కొక్కరికి 3వేల రూపాయల చొప్పున చెల్లించడం జరిగిందన్నారు. తద్వారా 15 లక్షల 90వేల రూపాయలు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ సుధారాణి, దంపూరి భాస్కర్ యాదవ్, నరసింహయాదవ్, మునిశేఖర్, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్‌సి మునికృష్ణ, పుష్పావతి యాదవ్, ఎం నాగరాజు యాదవ్, జి. వేణుగోపాల్ నాయుడు, కె.రాయల్, కె.మురళి, జి.గాయత్రి, శారద, రెడ్డెయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.