చిత్తూరు

దేశాభివృద్ధికి నెహ్రూ కృషి ఎనలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 14: భారతదేశ అభివృద్ధికి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఎనలేని కృషి చేశారని డిస్కమ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర పేర్కొన్నారు. డిస్కమ్ కార్పొరేట్ కార్యాలయం (విద్యుత్ నిలయం)లో సోమవారం ఉదయం జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎండి హెచ్‌వై దొర మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం అనేక పోరాటాలు చేయడంతోపాటు సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా సేవలందించిన జవహర్‌లాల్ నెహ్రూ దేశాభివృద్ధికి అవిరళ కృషి చేశారని పేర్కొన్నారు. సాంకేతి రంగంలో దేశాన్ని అగ్రస్థానానికి చేర్చాలని నెహ్రూ అభిలషించారు. భారతదేశంలో అనేక బహుళార్థసాధక ప్రాజెక్టులను నెలకొల్పేందుకు నెహ్రూ నాంది పలికారని, అవి నేటికీ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ఆయన చేసిన కృషిని ప్రజలు ఎన్నటికీ మరువలేరని వివరించారు. నేటి సమాజంలోని ప్రజలు నెహ్రూ జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశాభివృద్ధికి చేయూతనందించాలని సూచించారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్కమ్ చీఫ్ జనరల్ మేనేజర్లు డి ఏసునాథు, టి సంతోషరావు, బి సంగీతరావు, ఎ వేణుగోపాల్, చీఫ్ ఇంజనీర్ కె నందకుమార్, జనరల్ మేనేజర్ ప్రభాకర్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.