చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సత్యాత్మాతీర్థ స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 6: కర్ణాటకలోని ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మతీర్థ స్వామివారు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న స్వామివారికి టిటిడి ఇఓ డి సాంబశివరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం సత్యాత్మతీర్థ స్వామివారు మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో టిటిడి ముందు ఉందన్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావు, పేష్కార్ సెల్వం, ఇతర అధికారులు పాల్గొన్నారు.