చిత్తూరు

జాతీయ మహిళా రాజకీయ సదస్సుకు జడ్పీ చైర్‌పర్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 12 : ఢిల్లీలో ఈ నెల 25వ తేదీన జరిగే జాతీయ రాజకీయ సాధికారిత సదస్సుకు జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి హాజరు కానున్నట్లు జడ్పీ సిఇవో పెంచలకిషోర్ తెలిపారు. ఈ సదస్సుకు చిత్తూరు మండలాధ్యక్షురాలు సునీత, చంద్రగిరి మండలం కొటాల సర్పంచ్ సుధా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఈ సదస్సుకు హాజరు కానుండగా అందులో చిత్తూరు జిల్లా నుంచే ముగ్గురు పాలుపంచుకోనున్నట్లు వివరించారు. జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 24న జార్ఘండ్‌లో జరిగే సదస్సులో కూడా జడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు ఎంపిపిలు, ముగ్గురు సర్పంచులు జిల్లా నుంచి హాజరు కానున్నట్లు చెప్పారు. పెనుమూరు ఎంపిపి హరిబాబు నాయుడు, కార్వేటినగర్ ఎంపిపి జనార్దన్‌రాజు, చిత్తూరు మండల పాలకూరు సర్పంచ్ మోహన్‌రాజు, చంద్రగిరి మండలం బుచ్చిరెడ్డిపల్లి సర్పంచ్ దిలీప్‌కుమార్, పెనుమూరు మండలం రామిరెడ్డిపల్లి సర్పంచ్ యోగానంద్‌చౌదరి హాజరు కానున్నట్లు తెలిపారు.