చిత్తూరు

రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించింది చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించింది చంద్రబాబు నాయుడని రాజ్యసభ సభ్యుడు సి ఎం రమేష్ అన్నారు. శనివారం ఆలయన మంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరందరికీ టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సి ఎం రమేష్ విలేఖరులతో మాట్లాడుతూ చరిత్రలో చదివిన రామరాజ్యం నేడు ఆంధ్ర రాజ్యంలో కనపడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న రాష్ట్భ్రావృద్ధి కార్యక్రమాలు త్వరలోనే పూర్తి అవ్వాలని దేవుడిని ప్రార్థించారని తెలిపారు. అలానే రాష్ట్ర పర్యావరణ మరియు అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, రాష్ఱ్రాభివృద్ధి కోసం కృషిచేస్తున్న చంద్రబాబు నాయుడికి శక్తి యుక్తులను ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థించామని తెలిపారు.