క్రైమ్/లీగల్

వృద్ధురాలి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురబలకోట, ఏప్రిల్ 6: కురబలకోట మండలం మోదివేడు క్రాస్ వద్ద నివాసం ఉంటున్న కృష్ణమ్మ (90) అనే వృద్ధురాలిని ఆమె మనవడు ఇంద్రప్రసాద్ శుక్రవారం రాత్రి హత్య చేసి పారిపోయాడు. మృతురాలు కృష్ణమ్మ గత ఎంతో కాలంగా మోదివేడు క్రాస్ వద్ద ఉన్న తన కుమార్తె వద్ద ఉంటోంది. ఆమె కుమార్తెకు ఇంద్ర ప్రసాద్ అనే మనవడు ఉన్నాడు. గతంలో వెలుగు బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం కృష్ణమ్మ కుమార్తె పనిపై బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఇంద్రప్రసాద్ పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. కొంత సమయం తరువాత ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఇంద్రప్రసాద్ ఒంటి నిండా రక్తం ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం చితకబాదారు. ఇంతలో అక్కడ నుండి తప్పించుకున్నాడు. ఇరుగుపొరుగు వారు కృష్ణమ్మ ఇంట్లోకి వెళ్లి ఆమెను చూడటంతో ఆమె మృతి చెంది ఉంది. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. అయితే రక్తస్రావం ఎక్కువగా ఉండటంతో మనవడు ఇంద్రప్రసాద్ అత్యాచారానికి ఒడిగట్టి ఆపై హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. వెంటనే సమాచారాన్ని సిఐ రమేష్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు అందించారు. ఇంద్రప్రసాద్ అత్యాచారం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే శవాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, ఇంద్రప్రసాద్ పెట్టిన బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.