చిత్తూరు

రాష్టప్రతి పర్యటకు పటిష్టంగా ఏర్పాట్లు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 19: జిల్లాలో భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 25న పర్యటించనున్నారు. పర్యటనకు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని జల్లా కలెక్టర్ సిద్దార్ధజైన్ పలుశాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం తన కార్యాలయంలో రాష్టప్రతి పర్యటనకు సంబంధించి పలుశాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదిన రాష్టప్రతి తిరుమల పర్యటనకు వస్తున్నారని, ఇందుకు సంబంధించి రేణిగుంట నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో అవసరమున్న ప్రదేశాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా, అవసరమైన జనరేటర్లువంటి ఏర్పాట్లపై ఏపీ ఎస్‌పిడిసి ఎల్ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యాధికారులు రాష్టప్రతి పర్యటనలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లారవాణా అధికారులు ప్రోటోకాల్‌కు అవసరమయ్యే వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో తుడా వీసి వినయ్‌చంద్, జాయింట్ కలెక్టర్-2 వెంకట సుబ్బారెడ్డి, సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా, ఆయా శాఖాధికారులు పాల్గొన్నారు.