చిత్తూరు

సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగలాపురం, ఏప్రిల్ 24: వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా మూడవరోజైన ఆదివారం నాగలాపురం మండల కేంద్రంలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం 5 గంటలకు ఆలయం తెరచి శుద్ధిచేసి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, తోమాలసేవ, అర్చన, వాహన సమర్పణ సమర్పించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఉదయం 7.30 గంటలకు స్వామి, అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ చేసి తిరువీధి ఉత్సవ అనంతరం సింహ వాహనంపై వేంచేపుచేసి మాడ వీధుల్లో ఊరేగించారు. ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు సల్లింపు, ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారికి సంప్రదాయం ప్రకారంగా అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. 10.30 నుంచి 11.30 గంటల వరకు రెండవ గంట, బలి,సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు రాత్రి కైంకర్యం. సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు బలిహారణం, సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లను వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణచేసి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల్‌సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు వాహన సమర్పణ, 8.30 నుంచి 10 గంటల వరకు తిరువీధి ఉత్సవం, ముత్యపు పందిరి వాహనంలో స్వామి,అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి అధికారులు తగు ఏర్పాట్లుచేసి పర్యవేక్షణ చేశారు.