చిత్తూరు

రాహుల్‌ది రామపాలన, మోదీది రాక్షస పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 19: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కోరుకునే శ్రీరాముని పాలన తెస్తారని, మోదీ రాక్షస పాలనకు అంతం పలుకుతారని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి పేర్కొన్నారు. మంగళవారం రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దేశ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ స్థానిక స్కావెంజర్స్ కాలనీలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం కేక్ కట్‌చేసి ప్రజలకు, పిల్లలకు పంచిపెట్టారు. ఈసందర్భంగా రుద్రరాజు శ్రీదేవి మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ స్కావెంజర్స్ కాలనీని సందర్శించారని, నేడు ఈ ప్రాంత ప్రజల మధ్య ఏఐసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని మోదీ రామ భజనలు చేస్తూ, దేశప్రజలను పీకల్లోతు కష్టాల్లోకి నెడుతున్నారని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ అమలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన విద్య, వైద్య, మహిళ, రైతు, కార్మిక సంక్షేమ పథకాలను నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు నరేంద్రబాబు బోయపాటి, బీసీ సెల్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శాంతి యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ స్వామి, దూది రమేష్, కాలనీ వాసులు శంకర్, శేషాద్రి, భరత్ తదితరులు పాల్గొన్నారు.