చిత్తూరు

2019లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం తధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 19: దేశ ప్రజల కష్టాలు 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడంతో తీరిపోతాయని, 5కోట్ల మంది ఆంధ్రులు అభిలషిస్తున్న ప్రత్యేక హోదా నిశ్చయమవుతుందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు పొలకల మల్లిఖార్జున పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్ధానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహం సమీపంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందని, ఈ క్రమంలో వారి త్యాగాలకు నివాళులు అర్పిస్తూ, యువనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం నిర్వహించారు. ఈసందర్భంగా వందమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రక్తదానంచేశారు. సిటీ కాంగ్రెస్ నిర్వహించిన రక్తదాన శిభిరాన్ని చూసి స్ఫూర్తి పొందిన కొందరు ప్రయాణికులు సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు పొలకల మల్లిఖార్జున, పీసీసీ కార్యదర్శి రాంభూపాల్ రెడ్డిలు మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం, బాబు పాలనలో రాష్ట్భ్రావృద్ధి 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. తిరిగి ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్నా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రజల అభివృద్ధి జరగాలన్నా అది రాహుల్ గాంధీతోనే సాధ్యమన్నారు. ఇప్పటికే దేశ, రాష్ట్ర ప్రజలు మోదీ, బాబుల దుష్టపాలనపై విసుగు చెందారన్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్‌కు అధికార పగ్గాలు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశ ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యమని బలీయంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. దేశంలో యువ రాజ్యం రావాలని రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారన్నారు. మోదీ, బాబు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారన్నారు. రాహుల్ గాంధీ మచ్చలేని నాయకుడన్నారు. ఆయన 49వ జన్మదినం ప్రధాని హోదాలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పాఠకం వెంకటేష్, యార్లపల్లి గోపి, ఎస్సీ సెల్ నాయకుడు కుమార్, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు మణి, మాజీ కౌన్సిలర్ చుక్కలదాము, సుధాకర్, మోహన్ రెడ్డి, లీలా శ్రీనివాస్, పోతల భాస్కర్, వడివేలు, వెంకీ, దేవా తదితరులు పాల్గొన్నారు.