చిత్తూరు

ఏర్పేడు వద్ద గూడ్స్‌రైల్ నుంచి వేరైన గార్డు పెట్టె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు, జూన్ 19: చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం, ఆమందూరు రైల్వే క్రాసింగ్ వద్ద గూడ్స్ రైలు నుంచి గార్డు పెట్టె వేరైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి మార్గంగా వెళుతున్న గూడ్స్ రైలు నుంచి ఆమందూరు రైల్వే క్రాసింగ్ వద్ద ఒక రైలు పెట్టె, గార్డు పెట్టె వేరు పడ్డాయి. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది గూడ్స్ డ్రైవర్‌కి సమాచారం అందించడంతో ముందుకెళ్లిన గూడ్స్ రైలు మళ్లీ వెనుకకు వచ్చి విడిపోయిన పెట్టెలను తగిలించుకొని వెళ్లింది. దీంతో ఏర్పేడు-వెంకటగిరి మార్గంగా వాహనాలు ఆమందూరు రైల్వే క్రాసింగ్ వద్ద 30 నిమిషాల పాటు స్తంభించి పోయాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన రైల్వే క్రాసింగ్ వద్ద జరిగింది కాబట్టి పెను ప్రమాదం తప్పింది. ఇంకెక్కడైనా మధ్యలో జరిగి ఉంటే తర్వాత వచ్చే రైళ్లకు ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని స్థానికులు, వాహన చోదకులు విస్మయానికి గురయ్యారు.