చిత్తూరు

కారు, టూరిస్టు బస్సు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారుపాళ్యం, ఏప్రిల్ 26: తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని బెంగళూరుకు వెళ్తూ మండలంలోని బెంగుళూరు-చెన్నై జాతీయ రహదారి మొగిలి మిట్టూరు సమీపంలో మంగళవారం తెల్లవారు జామున కారు, బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు. స్థానిక పోలీసుల కథనం మేరకు పలమనేరు వైపునుంచి చిత్తూరువైపువెళ్తున్న బస్సు, తిరుమల నుంచి బెంగళూరు వైపువెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బెంగళూరు అన్నమయ్య సర్కిల్‌లో నివాసం ఉండే వనిత(10) అక్కడికక్కడే మృతి చెందగా సాయికుమార్(31) పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సురేష్(25), రాజేంద్ర(55), లక్ష్మి(50), శే్వత(30), ఆశా(10)లకు తీవ్ర గాయాలు కాగా గీత, రేఖ, విజయ, లక్ష్మమ్మలకు స్వల్ప గాయాలైయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నెట్టి కంఠయ్య తెలిపారు.