చిత్తూరు

సుప్రభాత సేవలో ఆర్థిక మంత్రి యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 17: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం శ్రీవారి అభిషేకలో పాల్గొన్నారు. ఆయనకు టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ధ్వజ స్తంభానికి నమస్కరించుకున్న మంత్రి యనమల రామకృష్ణుడు రంగనాయకులు మండపానికి చేరుకున్నారు. ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం శ్రీనివాస కల్యాణం
తిరుపతి, ఆగస్టు 17: కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం శ్రీనివాస కల్యాణం అని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మొన్న మహానటి, నేడు శ్రీనివాస కల్యాణం చిత్రాల్లో నటించే భాగ్యం కలగడం, ఈ రెండు చిత్రాలు విజయవంతం కావడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చానని తెలిపారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు చేపట్టిన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం విజయవంతమైందని, ఇప్పుడు స్వామి వారు కళకళ లాడుతున్నారన్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన రుత్విక్కులకు, టీటీడీ అధికారులకు, సహకరించిన భక్తులకు రాజేంద్రప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.