క్రైమ్/లీగల్

స్కూల్ బస్సు ఢీకొని బాలుడు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములకలచెరువు, సెప్టెంబర్ 5: స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. మండలంలోని కదిరినాధునికోట పంచాయతీ, నాయునివారిపల్లెకు చెందిన తిరుమల ఆనంద్, శశికళ దంపతుల కుమారుడు తిరుమల అజయ్ మండల కేంద్రమైన ములకలచెరువులో ఓ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. అయితే బుధవారం సాయంత్రం స్కూల్ ముగిసిన తరువాత విద్యార్థులను వారి వారి గ్రామాల వద్ద వదిలిపెట్టేందుకు స్కూల్ బస్సు డ్రైవర్ విద్యార్థులను ఎక్కించుకొని బయలదేరింది. నాయునివారిపల్లెలోని ఇంటి వద్ద అజయ్‌ని వదిలిపెట్టేందుకు బస్సు వెళ్లింది. ఈ క్రమంలో అన్న బస్సులో తిగుతున్నాడని విషయం తెలుసుకొని తమ్ముడు టి.్భనుప్రకాశ్(3)లు బస్సు కదులుతుండగా అడ్డంగా దూరడంతో బస్సు ఢీ కొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తమ కళ్ల ముందే కుమారుడు బస్సు కింద పడి ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ రుషికేశవ, ఎస్‌ఐ ఈశ్వరయ్య సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ఏరియా అసుపత్రికి తరలించారు.