చిత్తూరు

15 నుంచి తిరుమల్లో పద్మావతి పరిణయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 8: శ్రీ పద్మావతి పరిణయోత్సవ వేడుకలను పురస్కరించుకుని నారాయణగిరి ఉధ్యానవనంలో ఏర్పాట్లను టిటిడి అధికారులు చేపడుతున్నారు. ఈనెల 15 నుంచి మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. పద్మావతి పరణయోత్సవం సందర్బంగా బాణా సంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో ఆలయ ఉత్సవాల్లో బాణా సంచా ప్రేలుడును దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా పద్మావతి పరిణయోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణ గిరి ఉద్యానవనాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు.