క్రైమ్/లీగల్

పట్టపగలే వ్యక్తిపై హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, నవంబర్ 13: ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం ఉదయం మదనపల్లె పట్టణం బ్యాంకర్స్‌కాలనీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇటీవలకాలంలో మహిళా న్యాయవాధి హత్య జరిగిన ప్రదేశానికి అతిసమీపంలోని వ్యక్తిపై హత్యాయత్నం చేశారు. రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ సురేష్‌కుమార్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.. పట్టణంలోని బ్యాంకర్స్‌కాలనీలోని మమ్మారమ్మ గంగమ్మ ఆలయం పక్కనే నివాసం ఉంటున్న కాశీ విశ్వనాధరెడ్డి(38) సొంతంగా కారు పెట్టుకుని బాడుగలకు వెళ్తున్నాడు. అంతేకాకుండా ఇంటివద్దే తన భార్య కవిత చిల్లరదుకాణం నడుపుతోంది. వారపుసంతలో కూరగాయలు, చిల్లర దుకాణం సరుకులు తీసుకుని ద్విచక్రవాహనంలో ఇంటికెళ్తున్న విశ్వనాధరెడ్డిని బ్యాంకర్స్‌కాలనీ ఎక్స్‌టెన్షన్ ప్రశాంతనగర్‌కు వెళ్లే మలుపువద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ గుర్తుతెలియని వాహనంతో ఢీకొని, వాహనంలోనుంచి కిందకు దిగిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడే ఇంటి నిర్మాణానికి ఉపయోగించే కర్రలతో తలపై తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్రావంతో పడిపోవడంతో చనిపోయాడని అనుకుని గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లిపోయారు. గాయపడిన విశ్వనాధరెడ్డిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి రెఫర్ చేశారు. సంఘటన స్థలాన్ని రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సురేష్‌బాబు, ఎస్‌ఐ దిలీప్‌కుమార్ పరిశీలించారు. భార్య కవితా ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.