చిత్తూరు

దాసపదాల్లో వేదాల సారం : సుబుదేంద్రతీర్థస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 17: దాసపదాల్లో వేదాల సారం దాగి ఉందని మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రతీర్థస్వామి ఉధ్ఘాటించారు. ఎందరో మహనీయులు కాలినడకన తిరుమల గిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకున్నారని, అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆధ్యాత్మిక చైతన్యం పొందడమే మెట్లోత్సవం అంతరార్థమని తెలిపారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శనివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రతీర్థస్వామి అనుగ్రహభాషణం చేస్తూ శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తిచేశారని వివరించారు. అలాంటి వారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్య ప్రసంగిస్తూ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలోవిచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్లు తెలిపారు. భజన మండళ్ల సభ్యులకు టీటీడీ మూడోసత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ , సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు. అంతకుముందు భజన మండళ్ల భక్తులు టీటీడీ అన్నదాన సత్రం ప్రాంగణం నుంచి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాల మండపం వద్ద సంప్రదాయబద్దంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 3వేల మందికిపైగా భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమల గిరులను అధిరోహించారు.