చిత్తూరు

మళ్లీ మీరే సీఎం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 14: మీ వెంటే మేముంటామని... మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తిరుపతి ఆటోడ్రైవర్స్ అన్నారు. నారావారిపల్లిలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు సోమవారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుదర్శన్ ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు ఖాజా, పలువురు ఆటోడ్రైవర్లు కలసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తాము కడుతున్న టాక్స్‌లకు మినహాయింపు ఇచ్చి మాకు తోడ్పాటు అందించడం సంతోషకరమన్నారు. ఎల్లప్పుడు మేము మీ వెంటే ఉంటామని, మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలన్నారు.

వైఎస్ విమలమ్మను సన్మానించిన బియ్యపు మధు
శ్రీకాళహస్తి, జనవరి 14: శ్రీకాళహస్తి పట్టణంలోని కాశాగార్డెన్‌లోని చర్చిలో ప్రార్థనల నిమిత్తం విచ్చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెల్లెలు, జగన్ మేనత్త విమలమ్మను నియోజకవర్గ కన్వీనర్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి కలసి సన్మానించారు. చర్చిలో ప్రార్థనలు చేసేందుకు సోమవారం శ్రీకాళహస్తి కాశాగార్డెన్‌లోని చర్చికి విమలమ్మ విచ్చేశారు. విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మధు గెలుపుకోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాస్టర్లు, వైసీపీ నాయకులు నిర్మల్‌కుమార్, కిరణ్, సురేష్, రమేష్, జయశ్యాం రాయల్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.