చిత్తూరు

పాకాల పోలీసుల అదుపులో ఇద్దరు టిడిపి నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకాల, మే 15: పాకాల పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందిపై దాడిచేసిన కేసులో ఇద్దరు టిడిపి నేతలను ఆదివారం ఎస్ ఐ వంశీధర్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి పాకాల పోలీస్ స్టేషన్లో సిబ్బందిపై దాడిచేసిన కేసులో 8మంది టిడిపి నేతలపై కేసులు నమోదు చేశామని ఇందులో భాగంగా మండల తెలుగు యువత అధ్యక్షులు కిశోర్ నాయుడు, పాకాల 3వ వార్డు ఎంపిటిసి భర్త రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా మిగిలిని ఆరుగురు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం పాకాల్లో టిడిపి, వైకాపాల మధ్య నెలకొన్న ఘర్షణలు పోలీసులపై దాడివరకు వెళ్లాయి. దీంతో పట్టణంలో ఏ ఆర్ పోలీసులతోపాటు ప్రత్యేక రక్షణ దళాన్ని కూడా రంగంలోకి దించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలకు, అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని డి ఎస్పీ లక్ష్మీనాయుడు, సి ఐ చల్లనిదొర, ఎస్ ఐ వంశీధర్‌లు హెచ్చరించారు. కాగాపాకాల్లో పోలీసులపై టిడిపి నేతల దాడి సంచలనం సృష్టిస్తోంది.