చిత్తూరు

‘కాసారం భూ పంపకాల్లో అక్రమాలను అరికట్టండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 24 : తొట్టంబేడు మండలం కాసరం గ్రామంలో ఏడు దఫాలుగా జరిగిన భూపంపకాల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయని, దీనిని అరికట్టి పేదలకు న్యాయం చేయాలని కోరుతూ తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశుశుక్లాకు ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, గిరిజన, పేదలకు భూములు ఇస్తామని చెప్పి నెల్లూరు, తిరుపతికి చెందిన కొందరు పెద్దలు వందల ఎకరాలను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై తగు విచారణ జరిపిస్తానని సబ్ కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు నాయకులు గురవయ్య, పి సుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి హరి, లక్ష్మీనారాయణ, ఎం చంద్ర, రాజు, పి మురళి, పి వెంకటేశ్, వీరప్రతాప్ పాల్గొన్నారు.