చిత్తూరు

తొమ్మిదో తరగతి విద్యార్థిని కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, జూలై 12: శ్రీ కాళహస్తి పట్టణంలోని మునిసిపల్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదోతరగతి చదవే ఒక విద్యార్థిని మంగళవారం ఉదయం కిడ్నాప్‌కు గురైంది. పట్టణంలోని బాలసదన్‌లో ఉంటూ తెలుగు గంగకాలనీలో ఉంటున్న మునిసిపల్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మంగళవారం ఉదయం బాలసదన్ నుంచి పాఠశాలకు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి విద్యార్థిని కిడ్నాప్ చేశారు. పిచ్చాటూరు మండలంలోని నాగమాంబాపురం గ్రామానికి చెందిన ఆ విద్యార్థిని ఒకరితో ప్రేమలో పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ కారణంగానే ఆ విద్యార్థిని ఆ యువకుడితో వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ చేసే సమయంలో ఆ విద్యార్థిని ప్రతిఘటించలేదు. ఎటువంటి అరుపులు కేకలు వేయలేదు. దీంతో ప్రేమ వ్యవహారంతోనే కిడ్నాప్ నాటకం జరిగనట్లు అనుమానిస్తున్నారు. బాల సదన్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.