చిత్తూరు

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగలాపురం, జూలై 12: మహిళా హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు విధించినట్లు నాగలాపురం ఎస్ ఐ మునస్వామి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ నాగలాపురం మండలం టి పి కోట గ్రామంలో 2011 సంవత్సరంలో టిపి కోట ఆది ఆంధ్రవాడకు చెందిన అమ్మలు, ముస్లిం కాలనీకి చెందిన కరిముల్లా మధ్య అక్రమ సంబంధం ఉండేది. తరువాత వీరి మధ్య వివాదం ఏర్పడడంతో కరీముల్లా ఆమెను హత్యచేశాడు. దీంతో కేసు సత్యవేడు కోర్టునుంచి తిరుపతిలో విచారణకు వచ్చింది. మంగళవారం తిరుపతి నాల్గవ అడిషినల్ జడ్జి కరీముల్లాకు జీవితఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్ ఐ తెలిపారు.