చిత్తూరు

గ్రామాల్లోకి ఎగబడిన ఏనుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కోట, జూలై 12 : మండల పరిధిలోని అటవీ సరిహద్దు గ్రామాల పంట పొలాలపై ఇంతకాలం దాడులకు పాల్పడిన ఏనుగులు ఇప్పుడు గ్రామాల సమీపంలోకి రావడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి మూడు ఏనుగుల గుంపు యాలకల్లు సమీపంలో పంటలపై దాడులకు పాల్పడ్డాయి. గ్రామస్థులు అప్రమత్తం కావడంతో అటవీ సిబ్బంది సహకారంతో వాటిని అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నించారు. అయితే హఠాత్తుగా ఏనుగులు కృష్ణాపురం, బోడిగుట్లపల్లి గ్రామాల సమీపం నుంచి అడవిలోకి వెళ్లాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏనుగులు పంట పొలాలపై, గ్రామాల వైపు రాకుండా గట్టి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.