చిత్తూరు

శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 12: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 17న సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ తిరుమంజన ఉత్సవాన్ని పురస్కరించుకొని టిటిడి అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దుచేసింది. ముందుగా స్వామివారి మూలవిరాట్టు వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయంలోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు,పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితోశుభ్రం చేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ ఓ డాక్టర్ సాంబశివరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అనంత, భానుప్రకాష్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఇ ఓ కోదండరామారావు, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.