చిత్తూరు

కుప్పంలో మూడు రైళ్ల హాల్ట్‌కు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, జూలై 15: గత కొనే్నళ్లుగా కుప్పంలో పలురైళ్లను ఆపేందుకు ప్రజలు కోరుతున్నా నేటికీవారి కోరిక ఫలించింది. కుప్పం నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిఎం చంద్రబాబునాయుడు అభ్యర్ధన మేరకు కేంద్ర రైల్వేశాఖ మూడు రైళ్లు కుప్పంలో నిలిపేందుకు అనుమతి లబించినట్లు సిఎం పిఎ మనోహర్ తెలిపారు.
బెంగళూరు నుంచి కుప్పం మీదుగా పాటలీపుత్ర వెళ్లే సంఘమిత్ర రైలు, బెంగళూరు నుంచి కుప్పం మీదుగా తిరుపతికి వెళ్లే ఇంటర్‌సిటి సూపర్‌ఫాస్ట్ రైలు, చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే డబుల్ డెక్కర్ రైళ్లను ఈనెల 25నుండి రెండు నిమిషాలు కుప్పంలో నిలిపేలా అనుమతి లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రైళ్ల రాకపోకల ద్వారా ప్రయాణీకులు, ఉద్యోగులు, విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా పలువురు పురప్రముఖులు చంద్రబాబునాయుడుకు తమ కృతజ్ఞతలు తెలిపారు.