చిత్తూరు

కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవింద రాజస్వామి వారి జ్యేష్ఠ్భాషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 17: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠ్భాషేకం ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కల్యాణ మండపంలోని వేంచేపే చేశారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు శతకలశ స్నపనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం, చెరకు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. అనంతరం మహాశాంతి హోమం, తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 4.30 వరకు స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఉభయనాంచారులతో శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి వరలక్ష్మి, ఎ ఇ ఓ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.