చిత్తూరు

భక్తులకు అందుబాటులో శ్రీవారి అర్చన టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి మంగళవారం నిర్వహించే అర్చన సేవా టిక్కెట్లను టిటిడి జారీ చేయనుంది. శ్రీవారికి బుధవారం నిర్వహించనున్న సేవకు సంబంధించి టిక్కెట్లను భక్తులకు కేటాయించనుంది. ఈ మేరకు అర్చన (18) టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. సేవాటిక్కెట్లను కోరుకునే భక్తులు తిరుమలలోని కేంద్రీయ విచారణా కార్యాలయం (సిఆర్‌ఓ) ఆవరణంలోని ఆర్జిత కౌంటర్‌లో వ్యక్తిగతంగా హాజరై వేలిముద్రను పొందుపరచి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు అవకాశాన్ని భక్తులకు టిటిడి కల్పిస్తోంది. అనంతరం ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా అందుబాటులో ఉన్న టిక్కెట్లను బట్టి భక్తులను ఎంపిక చేస్తారు. లక్కీడిప్‌లో ఎంపికైన భక్తులు రాత్రి 8 గంటలలోపు టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అర్చన టిక్కెట్ ధర రూ.220గా నిర్ణయించింది.