చిత్తూరు
బండ పడి ఒకరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 July 2016
పుంగనూరు, జూలై 18: బండ పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. మృతిని కుటుంబ సభ్యుల కథనం మేరకు మండలంలోని వనమలదినె్న పంచాయతీ కుమ్మరగుంట గ్రామానికి చెందిన మునస్వామిరెడ్డి(50) గ్రామ సమీపంలోని బండపై బండలు కొట్టుకుని జీవనం సాగించేవాడు. సోమవారం యథావిధిగా బండపై బండలు ఎద్దుల బండిపై తీసుకుని కుమ్మరగుంట సమీపంలోని అత్తిపల్లె గ్రామానికి తరలిస్తుండగా అత్తిపల్లె సమీపంలో ఎద్దుల బండి అదుపుతప్పి కిందకు పడడంతో మునస్వామిరెడ్డిపై బండలు పడ్డాయి. స్థానికులు గమనించి పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మదనపల్లెకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని వారు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.