చిత్తూరు

ప్రజల్లో మమేకం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 25: ప్రజల్లో మమేకవౌతూ వారి సమస్యలను పరిష్కారానికి కృషిచేయడం ద్వారానే పార్టీ పట్ల వారిలో విశ్వాసం పెంచేందుకు సాధ్యమవుతుందని, ఆ దిశగా కార్యకర్తలు కృషిచేయాలని ఉత్తరాంధ్ర జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో చిత్తూరు, కడప జిల్లాల స్థాయి విద్యావైజ్ఞానిక తరగతుల కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శర్మమాట్లాడుతూ ప్రకృతి సూత్రాలప్రకారం సమాజం మార్పుచెందడం సహజమని, అయితే ఈ క్రమంలో భారత సమాజం కూడా మార్పుచెందడం అనివార్యమన్నారు. ఈనేపథ్యంలో ప్రజల్లో పార్టీపై విశ్వాసం పెరగాలంటే వారి సమస్యల పరిష్కారమొక్కటే మార్గమన్నారు. అదే సమయంలో పాలకులు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వారిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపి ఎం జిల్లా కన్వీనర్ ఓబులేశు, కడప జిల్లా కార్యదర్శి ఆంజినేయులు, సి పి ఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డి, సీనియర్ నాయకులు చల్లావెంకటయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి తదితరులు పాల్గొన్నారు.